Thursday, May 9, 2024

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

బైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎన్.ఆర్ గార్డెన్ లో బైంసా డివిజన్ వ్యాప్తంగా ఉన్నా అంగన్వాడి సంబంధిత అధికారులు, కేంద్రల సిబ్బంది, మహిళలు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్త్రీ,శిశుసంక్షేమ శాఖ అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకి 130 అంగన్వాడి కేంద్రాలు మంజూరయ్యాయని, దాంట్లో 50 పైగా తాలూకాకి రానున్నయని తెలిపారు. పక్క రాష్ట్రాలు సైతం మన పథకాలు చూసి ఆశ్చర్యపోతున్నాయంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో సుధీర్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సాగర రాజన్న ,ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, కుబీర్ జెడ్పిటిసి అల్కత్తాయి, భైంసా ఎంపిటిసి రజాక్, ముధోల్ సిడిపిఓ శ్రీమతి, భైంసా ఇన్చార్జి సిడిపిఓ నాగలక్ష్మి బి.అర్.ఎస్ నాయకులు, ప్రజాపతినిధులు, అంగన్వాడి,ఐ.కె.పి సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement