Friday, May 3, 2024

వర్మీ కంపోస్టు విధానంపై అవగాహన..

బెల్లంపల్లి : పట్టణంలోని గురిజాల గ్రామపంచాయితీలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌ గాజుల రంజిత-వెంకటేష్‌ల అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో డీఆర్‌డీఏ సిబ్బంది నాడెపు కంపోస్టు వాడే విధానం… వర్నీ కంపోస్టు వాడే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మీ, మండల పంచాయితీ అధికారి శ్రీనివాస్‌, ఎంపీటీసీలు శకుంతల-వెంకటేష్‌, మండల సర్పంచులు తాళ్లపల్లి అశోక్‌గౌడ్‌, పొట్లపల్లి ఉమాదేవి-సుభాష్‌రావు, రాజమౌళి, రాజలింగు, స్వరూప-వెంకటస్వామి, మాధవి-శ్రీనివాస్‌, ప్రమీళ-చంద్రగౌడ్‌, ఏపిఓ జీనత్‌, ఈసీ శ్రీనివాస్‌, మండల కార్యదర్శిలు పిఏలు, గ్రామపంచాయితీ మల్టీ వర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement