Wednesday, May 15, 2024

రెండు లారీలు ఢీ.. ఒక‌రు మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

రెండు లారీలు ఢీకొన‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న విషాద ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మందమర్రి మండలం మేడారం గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. మేడారం ఎస్సార్ పెట్రోల్ పంపు సమీపంలో రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ రెండు లారీలు చత్తీస్ గఢ్ కు చెందినవిగా గుర్తించారు. ఈఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement