Thursday, May 2, 2024

ర‌న్ వే నుంచి జారిన ఇండిగో విమానం- త‌ప్పిన ప్ర‌మాదం

ఇండిగో విమానం టేకాఫ్ అవుతోన్న స‌మ‌యంలో ర‌న్ వే నుంచి జారిపోయింది. అస్సాంలోని జోర్హత్ విమానాశ్రయం నుంచి కోల్ క‌తాకు వెళ్తోంది ఈ విమానం. కాగా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన ఫొటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో, ఈ విమాన సర్వీసును ఇండిగో ఆపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement