Sunday, April 28, 2024

దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు : మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

పెద్దపల్లి : దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో 220 మంది లబ్ధిదారులకు దళిత బంధు ద్వారా మంజూరైన యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, రామగుండం కార్పోరేషన్‌ మేయర్‌ అనిల్‌ కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement