Wednesday, May 8, 2024

ADB : క‌రెంటు షాక్‌… ఇద్ద‌రు మృతి

కడెం, నవంబర్ 5(ప్రభ న్యూస్)
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కొమురం భీం వర్ధంతి కార్యక్రమంలో భాగంగ మండలంలోని చిన్న బెల్లాల్ గోండుగూడెంలో కొమురం భీం జెండాను ఎత్తే సమయంలో అక్కడే ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లకు జెండా ఇనుప పైపు తగిలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగ ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

వెంటనే క్షతగాత్రులను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పేంద్రం మోహన్ (26) మార్గం మధ్యలో మృతిచెందగా మరొకరు అత్రం భీమ్ రావు(25) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందాడు. మరొక వ్యక్తి వెంకు పటేల్ పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో అతనిని వైద్య చికిత్స నిమిత్తం ఖాన్ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆదివాసీ గిరిజన యువకుల మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషా ద చాయలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement