Sunday, April 28, 2024

బెల్లంపల్లిలో మ‌ళ్లీ గులాబీ జెండా ఎగరాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి నియోజకవర్గంలో మూడోసారి గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశంలో అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్ చార్జి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం పేపర్లు తమ అనుచ‌రుల‌తో లీక్ చేయిస్తూ ప్రభుత్వంపై నింద వేస్తున్నారని, దీన్ని ప్రజలంతా గమనించాలని అన్నారు. బెల్లంపల్లిలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement