Tuesday, May 7, 2024

బండి సంజ‌య్ పిటిష‌న్ పై హైకోర్టులో రేపు విచార‌ణ

తెలంగాణ‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు పై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఎంపీగా బండి సంజయ్ ను అర్థరాత్రి బలవంతంగా, అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లటాన్ని సవాల్ చేస్తూ పార్టీ లీగల్ ఈ పిటీషన్ వేసింది. ఈ రోజు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి ప్రక్రియను మాత్రం రేప‌టికి వాయిదా వేసింది. ఈ పిటీషన్ లో మొత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, బొమ్మల రామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు. హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణకు వచ్చే ముందే.. ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చూపించారు పోలీసులు. అతన్ని హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement