Saturday, May 4, 2024

నిర్మల్ డీసీసీ అధ్యక్షులుగా శ్రీహరిరావు

నిర్మల్ టౌన్, ఆగస్టు 10 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉద్యమ నేత కూచాడి శ్రీహరి రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ… నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, మూడు నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన ముధోల్, ఖానాపూర్, నిర్మల్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తనవంతుగా కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తానని సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement