అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సమాచారం లీకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. కీలక అంశా లపై గోప్యత పాటించాలని సర్వీస్రూల్స్ చెబుతున్నా అందుకు విరుద్ధంగా ముఖ్య మంత్రి కార్యాలయంతో సహా కొన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్ల సమాచారం బయటకు ఎలా పొక్కుతోందనే విషయ మై సీఐడీ ఆరా తీస్తోంది.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకరిద్దరు ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరుతో ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయని కొందరు బ్యూరోక్రాట్లు తమ గాడ్ ఫాదర్లను ప్రస న్నం చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గత కొద్ది నెలల క్రితమే ముందుగా ఆంధ్రప్రభ దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైన సంగతి విదితమే. సీఎంఓలో ఆ ఉన్నతా ధికారుల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్నందునే లీకుల పర్వా నికి దారితీసిందనే ప్రచారం జరుగు తోంది.
ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాలనా వ్యవస్థ లో ఒకింత ప్రక్షాళన చేపట్టినా ఉన్నతాధికారులు.. బ్యూరోక్రాట్ల అనుభవాన్ని ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖతో పాటు- కృష్ణా బోర్డు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ- ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తమ పరిశీలనలో వెల్లడైన విషయాలకు ఇపుడు ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితులను క్రోడీకరించి కృష్ణా బోర్డు అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించినట్టు- తెలిసింది. రోజుకు 2.07 టీ-ఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీ-ఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే సామర్దం ఉన్న పైపులైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్టు- గతంలో ఎన్జీటీ-కి సంయుక్త కమిటీ- నివేదిక సమర్పించింది. పర్యావరణ, అటవీ అనుమతుల ఉల్లంఘనలు ఉన్నాయనీ, దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి 3.7 కోట్ల జరిమానా విధించాలని కూడా సంయుక్త కమిటీ- -టైబ్యునల్కు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేస్తూ ఎన్జీటీ- ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణాలో కేటాయింపులు లేవు..
తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు లేకపోగా కృష్ణాలో ఒక్క చుక్క నీటి కేటాయింపులు కూడా లేవని ఏపీ వాదిస్తోంది. కృష్ణా జల వివాదాల -టైబ్యునల్ -1, -టైబ్యునల్-2 ముందు ఎప్పుడూ పాలమూరు-రంగారెడ్డి ప్రస్తావన రాలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లోనూ ఈ ప్రాజెక్టుకు చోటు- లేదు. కేంద్ర జలశక్తి విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లోనూ పాలమూరు-రంగారెడ్డి అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోనూ పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వెల్లడిస్తూ ఏపీ ప్రభుత్వం రెండు అఫిడవిట్లను ఎన్జీటీ-లో దాఖలు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నె-్టట-ంపాడు, కల్వకుర్తి తప్ప నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టయినా కొత్తదే అవుతుంది. కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు కేటాయింపులు, అనుమతులు కావాలి. అందువల్లనే పాలమూరు-రంగారెడ్డిని తాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన అన్ని పనులు చేపడుతోంది. శ్రీశైలం నుంచి 90 టీ-ఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకం కింద ఉన్న ఆయకట్టు-కు తరలించేందుకు ప్రయత్నించటం చట్ట విరుద్ధం..రాయలసీమ జిల్లాలతో పాటు- ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగునీటి ప్రయోజనాలకు విఘాతంగా మారనున్న పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు డీపీఆర్ పరిశీలనార్హత లేదని ఏపీ వాదిస్తోంది, ఈ నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం మనుగడకు తాజాగా కృష్ణా బోర్డు సమర్పించిన నివేదిక కీలకం కానుంది.