Thursday, May 16, 2024

ADB | మానవత్వాన్ని చాటిన ఆర్టీసీ అధికారులు.. బస్సులో మర్చిపోయిన సూట్ కేసు అందజేత

ఉట్నూర్, (ప్రభ న్యూస్): ఆదిలాబాద్​ జిల్లాలోని ఉట్నూర్ డిపోకు చెందిన కండక్టర్, అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు బస్సులోనే తన సూట్ కేసును మర్చిపోతే, వారు దాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి అప్పగించిన ఘటన జరిగింది. అయితే.. బస్సులో వదిలేసిన సూట్ కేసును ఆర్టీసీ కండక్టర్ స్పందన గమనించి ఉట్నూరు డిపో ఆఫీసులో దాన్ని అప్పగించారు. ఉట్నూర్ మండలం ఏందా గ్రామానికి చెందిన ప్రయాణికుడు గుడిహత్నూర్ వెళ్లడానికి ఏందాలో బస్సు ఎక్కాడు. గుడిహత్నూర్ లో దిగే సమయంలో సూట్​కేసుని తీసుకోకుండా మర్చిపోయి హడావుడిగా దిగేశాడు.

అయితే.. ఈ సూట్ కేసు మరచిన ప్రయాణికునికి సమాచారం అందించడంతో పాటు.. అతనికి ఆర్టీసీ అధికారులు జనార్ధన్. కృష్ణమూర్తి తదితరులు ఇవ్వాల (బుధవారం) సుటికేస్ తో పాటు అందులో ఉన్న 8 వేల రూపాయలను అప్పగించారు. తన సూట్​కేసుని తిరిగి ఇవ్వడంతో ఆ వ్యక్తితోపాటు, చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement