Thursday, May 2, 2024

రైతులకు చట్టప్రకారం చెల్లింపులు..

బెల్లంపల్లి : రైతులకు చట్ట ప్రకారం గరిష్ఠంగా ఎకరానికి రూ.3.97 లక్షలను చెల్లింపు చేయగలమని, పరిహారంను అంగీకరించి తీసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్డీఓ శ్యామలాదేవిలు అన్నారు. గొల్లపల్లి వాగు బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి భూమి కోల్పోయిన బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కోసం సహకరించాలని రైతులను కోరారు. పరిహారం పెరుగుదల కోసం కలెక్టర్‌తో మాట్లాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశిల్దార్‌ మధుసుదన్‌, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కోలి వేణుమాదవ్‌, మండల రైతు సమన్వయ సమితీ అధ్యక్షుడు తలండి భీమన్న, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement