Friday, April 19, 2024

ఎంపీడీఓ కార్యాలయంలో టీకా ఉత్సవ్..

బెల్లంపల్లి : మండల పరిషత్‌ కార్యాలయంలో టీకా ఉత్సవ్‌కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్‌పి వైస్‌చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, ఎంపీడీఓ విజయలక్ష్మి, తాళ్ల గురిజాల పిహెచ్‌సీ వైద్యురాలు ఝాన్సీ హాజరై మాట్లాడారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతీఒక్కరు టీకా తీసుకోవాలని, ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాస్‌, హెచ్‌ఈఓ సమ్మయ్య, ఐకేపి ఏపీఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement