Monday, April 29, 2024

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ప్ర‌తి ఒక్క‌రూ యోగా చేయ‌డం అల‌వాటుగా చేసుకోవాల‌ని యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తుంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు. చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజూ ఒక గంట లేదా అరగంట యోగా చేస్తే శరీరానికి చాలా మంచిదని, చిన్న చిన్న జబ్బులు కూడా యోగాతో ఇట్టే తగ్గిపోతాయన్నారు. రోజుల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారని ఆయన 24 దేశాలల్లో 30 వేల కిలోమీటర్ల మేర బైక్‌పై ప్రయాణించారని చెప్పారు. మనిషి శరీరం బాగుంటేనే మనం ఎన్నోరకాల కార్యక్రమలు చేయగలమని అందుకు యోగా తప్పకుండా చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా అడవుల వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement