Saturday, May 4, 2024

పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు

సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి వెనుక సుబ్బారావు సహకారం ఉందని భావిస్తూ.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. 10 ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement