Thursday, April 25, 2024

మున్సిపల్‌ కార్యాలయంలో బడ్జెట్‌ సమావేశం

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ అద్యక్షతన జరిగిన 2020-21వ సంవత్సరం బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ భారతి హొళికేరి, అడీషనల్‌ కలెక్టర్‌ త్రిపాఠి హాజరై మాట్లాడారు. అనంతరం ఆర్థిక సంవత్సరం 2020-21వ సంవత్సరం మొత్తం ఆధాయం రూ.11.70 కోట్లు పోగా మిగులు బడ్జెట్‌ రూ.88వేలకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌, గౌరవ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement