Monday, May 6, 2024

అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రజల చిరకాల వాంచ అయిన ఇండ్లకు పట్టాల సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత 20 నుండి 30 యేండ్లుగా నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇప్పించాలని సంబందిత మంత్రికి విన్నవించారు. పట్టణంలో ఉన్న సింగరేణి సంస్థకు అవసరం ఉన్న భూములను ప్రభుత్వానికి అప్పగించాలని, గతంలో సీఎం కేసీఆర్‌ ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇండ్ల స్థలాల పట్టాల కోసం మాట్లాడిన ఎమ్మెల్యేకు బెల్లంపల్లి పట్టణ ప్రజలంతా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement