Tuesday, April 30, 2024

ADB : శ్రీవారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్): అదిలాబాద్ ఎమ్మెల్యే, బిజెపి లోక్‌స‌భ‌ఎన్నికల ఇంఛార్జ్ పాయల్ శంకర్ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తిరుపతి బాలాజీ దర్శనం చేసుకుంటానని మొక్కిన పాయల్ శంకర్ కొత్త తెలుగు సంవత్సరాది ఉగాది పండగ వేళ కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లారు.

బుధవారం పాయల్ శంకర్ తో పాటు సతీమణి పాయల్ ఉమా, పాయల్ శంకర్ కూతురు శరణ్య, అల్లుడు సిద్దు, మనవడు అద్వైత్ కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
మరోసారి ప్రధాని మోదీ కావాలని…
మూడోసారి ప్రధాని గా తిరిగి మోది విజయం సాధించాలని, అదిలాబాద్ పార్లమెంటు స్థానంలో బిజెపి ఘన విజయం సాధించాలని, కొత్త సంవత్సరం వేళ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్టు పాయల శంకర్ ఆంధ్రప్రభ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement