Sunday, April 28, 2024

ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే..

కాసిపేట : కాసిపేట మండలం మల్కేపెల్లి గ్రామానికి చెందిన జంజిరాల సత్తయ్య అనే కౌలు రైతు కుటుంబం ఇటీవలే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడగా, మృతుల కుటుంబ సభ్యులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కలసి పరమర్శించారు. శంకర్‌ కుటుంబం బలవన్మరణం చెందడం చాలా బాదకరమన్నారు. మీ కుటుంబానికి అండగా వుంటానని తెలియచేస్తూ పది వేల రూపాయల ఆర్థిక హాయాన్ని అందించారు. అంతకు ముందు ధర్మారావుపేట గ్రామ పంచాయతీ మాజి సర్పంచ్‌ జాదవ్‌ లలిత మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియచేశారు. అనంతరం కోమటిచేను గ్రామ సమీపంలోని సల్పలవాగు చెరువు కెనాల్‌ పనులను, పాలీహౌస్‌లో సాగు చేసిన పంటలను పరిశీలించాడు. ఈ కార్యక్రమాలలో జడ్పీటిసి చంద్రయ్య, వైస్‌ ఎంపిపి విక్రమ్‌రావు, రైతు సంఘం అధ్యక్షుడు దుర్గం పోశం, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌లు మంజులరెడ్డి, వాసుదేవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టి నాయకులు మోటూరి వేణు, తిరుపతి రెడ్డి, లంక లక్ష్మన్‌, ఎంపిటిసిలు, సర్ప్‌ంచ్‌లు, పార్టి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement