Monday, May 13, 2024

ఏపీ అమ్మాయికి అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు తేజం వెలుగు చూసింది. వాషింగ్టన్ డీసీలో జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ రూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు. మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపాకు అవకాశమిచ్చారు. ఈ ప్రతిపాదనకు సెనెట్ ఆమోదం తెలపడం లాంఛనమే కానుంది. కాగా ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా ఉన్నారు.

రూపా రంగా పుట్టగుంట అమెరికాలో సెటిలైన తెలుగు కుటుంబ వారసురాలు. ఆమె స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల. వీరు చాలా ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఆమెకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఉన్నత అవకాశం కల్పించారు. దీంతో అమెరికాలో మరో తెలుగు మహిళకు కీలక పదవి లభించినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement