Friday, May 3, 2024

అసెంబ్లీలో గళం వినిపించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి అసెంబ్లీలో గళం విప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలు మారుమూల మండలాలని, అందులో వేమనపల్లి పూర్తిగా మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుందని, ఈ 7 మండలాల్లో ఎక్కడ కూడా జూనియర్‌ కళాశాలలు లేవని, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 1200 నుండి 1400 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్‌కు వచ్చే సరికి కళాశాలలు లేక డ్రాప్‌అవుట్‌ అవుతున్నారని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల్లో జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని విద్యార్థులు, ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement