Saturday, April 20, 2024

మెగాస్టార్ తో సోనాక్షి జోడి!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఈ చిత్రంతో పాటు ‘వేదాళం’ రీమేక్ చేయ‌నున్నాడు  చిరు.  మెహర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రానుంది. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ బాబీతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చిరంజీవి ప్ర‌క‌టించేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌రిపాడ‌నే టాక్ వినిపిస్తోంది. చిరు-సోనాక్షి ఫెయిర్ స్క్రీన్ పై బాగా వర్కౌట్ అవుతుందని దర్శకుడు బాబీ భావిస్తున్నాడట. అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సీ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. తర్వలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement