బెల్లంపల్లి : ఎంసీపీఐ(యూ) పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఎం.డి.గౌస్ సంతాప సభను ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబ్బని కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం.డి.గౌస్ మరణం యావత్ భారతదేశ వామపక్ష ఉద్యమానికి, బడుగు, బలహీన వర్గాల దళిత జాతికి తీరని నష్టం అని అన్నారు. గౌస్ మరణ వార్త విని భారతదేశ వామపక్ష వాదులు, అభ్యున్నతవాదులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, పెద్ద దిక్కును కోల్పోయామని రోదిస్తూ కడసారి కన్నీటి జోహార్లను అర్పిస్తూ శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, కొండ శ్రీనివాస్, ఆరెపల్లి రమేష్, బర్ల స్రవంతి, సబ్బని విజయలక్ష్మి, రాజశేఖర్, శంకర్, అరుణ్, ఆకాష్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement