Wednesday, May 8, 2024

ADB: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి.. వెంకట రమణారెడ్డి

శ్రీరాంపూర్, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3గని పై బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సింగరేణి ఉద్యోగులతో మాట్లాడుతూ… మరొకసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నుండి బీజేపీ ఎంపీ ఉంటే సింగరేణి ఉద్యోగుల సమస్యలపై పార్లమెంటులో గళం వినిపిస్తారని అన్నారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపెల్లి బీజేపీ అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇన్ కం టాక్స్ పై కచ్చితంగా ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీ పరులైన అభ్యర్థులకే మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, కమలాకర్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement