Monday, April 29, 2024

అంగవైకల్య విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన ఐటీడీఏ పీఓ

ఉట్నూర్, జులై 21 (ప్రభ న్యూస్) : అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్ లో అంగవైకల్యం గల విద్యార్థులకి స్వీకారామ్ ప్రత్యేక కళాశాల సికింద్రాబాద్ లో చదవడానికి కావలిసిన ఫీజు చెక్కును శుక్రవారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భవిషత్తులో మరింత ఉన్నత చదువులు చదవాలని విద్యారులను ప్రోత్త్సహించారు. ఈకార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, ఏఓ రాంబాబు, విద్యార్థులు కుమ్ర చిన్న, సోయం సందీప్, శ్రీకాంత్, పోషకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement