Monday, April 29, 2024

బిజెపి కొత్త‌ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి శుభాకాంక్ష‌లు

కర్మన్ ఘాట్ జూలై 21 (ప్రభ న్యూస్ ) – తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గంగాపురం కిషన్ రెడ్డి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడానికి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటించి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన గంగాపురం కిషన్ రెడ్డి  పాదయాత్రలో తాను పాల్గొన్నట్లు వంగా మధుసూదన్ రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డి నాయకత్వాన అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement