Sunday, April 28, 2024

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే బాపురావు

బోథ్, జూన్ 7 (ప్రభ న్యూస్) : పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా తెలంగాణ‌ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు. బుధ‌వారం బోథ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 5 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2,18,000/-లను ఎమ్మెల్యే బాపురావు త‌న కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్, కార్యదర్శి ఎలుక రాజు, నాయకులు జగన్, తాహెర్, రమేష్, సత్యనారాయణ, నారాయణ, గంగాధర్ పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement