Wednesday, May 1, 2024

Karnataka Rtc : ఇక‌పై పురుషుల‌కి ప్రత్యేక సీట్లు..

ఆర్టీసీ బ‌స్సుల్లో స్త్రీల‌కి ప్ర‌త్యేకంగా సీట్లు ఉంటాయి..అంతేకాదు వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి అని రాసిని స్టిక్క‌ర్స్ కూడా క‌నిపిస్తుంటాయి. అయితే ఇకపై వాటి పక్కనే పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే స్టిక్కర్లు కనిపించబోతున్నాయట‌. కాకపోతే వాటిని చదవాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటారా.. ఆ నినాదాలు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లోనే కనిపించే అవకాశం ఉంది కాబట్టి. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు సీట్లు రిజర్వ్ చేసినట్లే ఇకపై పురుషులకూ 50 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు కర్ణాటక ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 11 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. డబ్బులు పెట్టి ప్రయాణించే పురుషులు నిల్చుని ప్రయాణించడం భావ్యం కాదని భావించిందో ఏమో కానీ.. సీట్లలో 50 శాతం పురుషులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ సీట్ల వెనుక పురుషులకు మాత్రమే అంటూ స్టిక్కర్లు అంటించనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో పురుషులు లేకుంటే స్త్రీలు ఈ సీట్లలో కూర్చోవచ్చు, పురుషులు రాగానే లేచి సీటివ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదో కొత్త‌ర‌కం మార్పు అనిపిస్తోంది క‌దూ..

Advertisement

తాజా వార్తలు

Advertisement