Sunday, May 5, 2024

ADB: ఫిట్నెస్ జీవితంలో ఒక భాగం కావాలి… ఎస్సై రాము

బోథ్, జనవరి 12(ప్రభ న్యూస్): నేటి యువత జీవితంలో ఫిట్నెస్ అనేది ఒక భాగం కావాలని ఎస్సై రాము అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్ లో పాల్గొన్నారు. అనంతరం యువతతో మాట్లాడారు.

రన్నింగ్,స్పోర్ట్స్, గేమ్స్, యోగ ఇలా ఎదో ఒక రంగంలో మక్కువ పెంచుకొని అనునిత్యం సాధన చేయాలని తద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా మాసం లక్ష్మీ సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని భుజం తట్టారు. 2 కె రన్ లో విజేతలైన భీమ్ రావు, వర్షిత్, శివరాజ్ లకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుంచి యువత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement