Thursday, May 2, 2024

Delhi: కొత్త ఎన్నిక‌ల చ‌ట్టంపై స్టేకు సుప్రీం నో…విచార‌ణ‌కు ఎస్…

ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సభ్యునితో కూడిన స్వతంత్య్ర ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సీజేఐ పాత్రను కేంద్ర సర్కార్ తొలగించింది.ఈ కొత్త చట్టం ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాది గోపాల్‌ సింగ్‌ సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం వాదనలు వినకుండా స్టే విధించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement