Monday, April 29, 2024

యూరియా కోసం రైతుల ఆందోళన..

జన్నారం, (ప్రభ న్యూస్): యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో వారం రోజులుగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతూ సోమవారం సాయంత్రం పొనకల్ సొసైటీ ఎరువుల, విత్తన విక్రయ కేంద్రం వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రస్తుతం రైతులు తమ వరి పంటకు యూరియాను వేస్తుంటారు. ఈ తరుణంలో యూరియ కొరత ఏర్పడడంతో రైతులు నానా తంతాలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని మండలానికి యూరియా పంపించాలని రైతులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement