Saturday, May 11, 2024

ADB: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రస్ నాయకులు

బోథ్, నవంబర్ 4 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలానికి చెందిన కాగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, ఎంపీపీ తుల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కన్వీనర్, ఎంపీటీసీ కుర్మే మహేందర్, మెరుగు బోజన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అబ్రర్ బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అబ్దుల్ అసిఫ్ బోథ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నరేందర్ కాంగ్రెస్ పార్టీ జనర్ సెక్రిటరి లాంటి ప్రముఖ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మెజారిటీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా వన్నెల అశోక్ అభ్యర్తిత్వాన్ని వ్యతిరేకించిన వారందరూ బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బోథ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement