Tuesday, May 14, 2024

కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..

బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్‌ నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనునిత్యం ప్రజాశ్రేయస్సే ఊపిరిగా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్‌ సోకడం బాధాకరమని అన్నారు. ఆయనకు కరోనా సోకిందనే వార్త తెలిసినప్పటి నుండి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు చేస్తున్న పూజలతో సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కౌన్సిలర్లు నీలి కృష్ణ, అప్సర్‌, టీఆర్‌ఎస్‌ యువజన అధ్యక్షుడు సన్నిబాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం భీమాగౌడ్‌, కొమ్మెర లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement