Wednesday, May 1, 2024

సీఎం కేసీఆర్ పాలనలో మారుతున్న పల్లె, పట్టణ రూపు రేఖలు : ఎమ్మెల్యే రేఖా

ఖానాపూర్ (ప్రభ‌ న్యూస్) : ఖానాపూర్ మండలం బాధనకుర్తి, చింతలపెట్ గ్రామాల మధ్య కోటి 20 లక్షల రూపాయలతో బిటి రోడ్డు నిర్మాణనికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలోనే పల్లె పట్టణ రూపు రేఖలు మారుతున్నాయని, అనంతరం గ్రామ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని నాడు ఉన్న పరిస్థితుల నుండి నేడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ మొయిద్, ఏఎంసీ చైర్మన్ పుప్పల శంకర్, ఎంపీటీసీ శనిగారపు రాణి, బాదన కుర్తి సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, నాయకులు వెంక గౌడ్ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement