Tuesday, April 30, 2024

నో పాలిటిక్స్.. ఓన్లీ మూవీస్.. మ‌నోజ్ బాజ్ పాయ్

త‌న జీవితంలో రాజ‌కీయాల‌కి చోటు లేద‌ని స్ప‌ష్టం చేశాడు బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్. తాజాగా ఆయన నటించిన ‘సిర్ఫ్‌ ఏక్‌ బండా కాఫి హై సినిమా విడులైంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన తన సొంతరాష్ట్రమైన బీహార్‌లోని పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులు రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్నించడంతో ఆయన పై విధంగా స్పందించారు. నటుడిగానే కొనసాగుతా..రాజ‌కీయాల్లోకి రాన‌ని మనోజ్‌ బాజ్‌పాయ్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నే తలెత్తదని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ , ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. అయితే అప్పటి నుంచి తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement