Friday, May 17, 2024

suicide: తరగతి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

త‌ర‌గ‌తి గ‌దిలో ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామ శివారులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని లూథియా తరగతి గదిలోనే చున్నితో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి విద్యార్థిని ఉరివేసుకొగా… గురువారం వెలుగు చూసింది.

ఆ విద్యార్థిని ఐదో తరగతి నుంచి అదే పాఠశాలలో చదువుతున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. నిన్న ఉదయం తమ గ్రామం నుంచి పాఠశాలకు వచ్చిందని, వచ్చిన మూడు గంటల వ్యవధిలో ఇలా జరిగిందని తెలిపారు. ఇదే మండలానికి చెందిన గుండ్ల మల్లాపురం గ్రామానికి చెందిన చిట్టిబాబు పెద్ద కూతురు లూథియా గా గుర్తింపు. విషయం తెలుసుకున్న క్రిష్ణగిరి పోలీసులు సంఘటన స్థలం దగ్గరకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement