Saturday, May 4, 2024

బాటసారుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు..

తాండూరు : ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తాండూరు సీఐ కోట బాబురావు అన్నారు. దాతల సహాయంతో అభినవ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐబీ కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు మజ్జిగ, మినరల్‌ వాటర్‌, అంబలిని అందించేందుకు దాతల సహాయంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సాలిగామ బానయ్య, తహశిల్దార్‌ కవిత, ఎంపీడీఓ శశికళ, తాండూరు ఎసై#్స శేఖర్‌ రెడ్డి, ఎంపీటీసీ మాసాడి శ్రీదేవి, ఇంచార్జి సర్పంచ్‌ నవీన్‌, అభినవ స్వచ్చంధ సంస్థ అధ్యక్షుడు కేశెట్టి సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement