Saturday, April 27, 2024

బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం..

తాండూర్ ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్ పాల్పడ్డాడని తాండూర్ ఎంపీపీ ప్రణయ్ కుమార్ ఆరోపించారు. గురువారం కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుబ్బ దత్తు మూర్తి, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, సర్పంచ్ క్రిస్టోఫర్, మండల కోఆప్షన్ సభ్యులు రహమత్ ఖాన్, మద్దికుంట రాంచందర్, విజయ్, జాడిపోచం, రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement