Sunday, May 5, 2024

అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు

జైనూర్, జూలై 4 (ప్రభ న్యూస్) : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని జామిని సమీపంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో భీమ్రావు, సంగీతలకు గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వగా.. 108 అంబులెన్సులో ప్రథమ చికిత్స చేయించి, అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఆటోలో బూసిమట్ట గిరిజన గురుకుల జూనియర్ కళాశాలకు కూరగాయలు తరలిస్తుండగా.. ఎదురుగా పశువు రావడంతో తప్పించబోయి బోల్తా పడ్డట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement