Monday, April 29, 2024

Bellampally: అంబేద్కర్ విగ్రహం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

బెల్లంపల్లి, జూన్ 22 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గురువారం ఉదయం కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు కొండగుర్ల వేద ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద ప్రకాష్ మాట్లాడుతూ.. వికలాంగులకు ప్రభుత్వం 3016, ఇవ్వడం జరుగుతుందన్నారు.

వికలాంగులకు చేయూతగా మరో వెయ్యి రూపాయలు పెంచి రూ.4016లు చేసినందుకు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం హర్షనీయమన్నారు. అనంతరం కూలీలకు, వికలాంగులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు అంజాద్ పాషా, జాడిశంకర్, పడాల వినోద్, గొర్లపల్లి అశోక్, ఎండి రహమద్, వికలాంగుల సంఘం నాయకులు కోడి శ్రీనివాస్, రామస్వామి హరీష్, దినేష్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement