Tuesday, May 21, 2024

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జట్ల ఎంపిక..

శ్రీరాంపూర్‌ : మంచిర్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ కబడ్డీ మహిళల, పురుషుల జట్ల ఎంపిక పోటీలను శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలను కౌన్సిలర్‌ తిరుపతి ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ నెల 25వ తేది నుండి 29వ తేది వరకు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాంచందర్‌ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 30, 31వ తేది ఏప్రిల్‌ 1, 2వ తేదిల్లో మెడ్చల్‌ జిల్లాలోని బొడుప్పల్‌లో జరిగే 68వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు ప్రాతినిత్యం వహిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి రాజేంద్రపాణి, ట్రెజరర్‌, చంద్రశేఖర్‌ తదితరులు
పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement