Tuesday, April 30, 2024

20, 21వ తేదిల్లో పార్టీ శిక్షణ తరగతులు

బెల్లంపల్లి : 20, 21వ తేదిల్లో జరగబోయే భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని మండలంలోని లంబాడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ఇంచార్జి రాజులాల్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు బుడియె విజయ్‌కుమార్‌లు అన్నారు. ఈ నెల 20, 21వ తేదిల్లో జరగబోయే శిక్షణ తరగతులకు ప్రతీ బూత్‌ అధ్యక్ష, కార్యదర్శులు, మండల నాయకులు, వివిద మోర్చల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అజ్మీర శ్రీనివాస్‌, మాసు రజిని, గాదర్ల రాజేష్‌, బోగె మధు, కాసిపాకం గంగారాం, అజ్మీర సుభాష్‌, రాజేష్‌, చంద్రమోహన్‌, బోగె ప్రకాష్‌, దుర్గం అఖిల్‌, భుక్య రాజేష్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement