Tuesday, May 21, 2024

రాష్ట్ర ఒబిసి వైస్‌ చైర్మన్‌గా బండి ప్రభాకర్‌ యాదవ్

బెల్లంపల్లి : గాంధీభవన్‌లో టీపీసీసీ, ఓబీసీ నూతన కార్యవర్గం నియామకంలో భాగంగా గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓబీసీ చైర్మన్‌గా గత 5 సంవత్సరాలు సేవలు చేసిన, కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న బండి ప్రభాకర్‌ యాదవ్‌ను ఓబీసీ స్టేట్‌ వైస్‌ చైర్మన్‌గా, ఆసీఫాబాద్‌ కుమ్రంభీం జిల్లా ఇంచార్జిగా నియమించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, కత్తి వెంకటస్వామిలకు, నూతనంగా ఓబీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీకాంత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు అదిష్టానం చెప్పిన విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement