Saturday, May 18, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రవికుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ భూవివాదం కేసులో యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెంకు చెందిన గుర్రాల రామకృష్ణ అనే వ్యక్తి దగ్గర నుండి నర్మెట్ట మండలంలోని భూమి విషయంలో ఎస్ఐ రవికుమార్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రామక్రిష్ణ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు సోమవారం ఎస్సై రవికుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement