Saturday, May 4, 2024

చంద్రబాబు, పవన్ లపై మంత్రి పేర్ని నాని ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఏమైంది… కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సీఎం జగన్ ను అభ్యర్థించారని అన్నారు. 1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి? ఆ మాత్రం తెలియదా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎంత చెబితే అంత… చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇస్తే పవన్ ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? నిలదీశారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అని పేర్ని నాని మండిపడ్డారు. 


Advertisement

తాజా వార్తలు

Advertisement