Sunday, May 5, 2024

టీఆర్‌‌ఎస్ ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్

వ‌డ్ల‌ను కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నా చేస్తున్న విష‌యం విదిత‌మే. అయితే మేడ్చల్ జిల్లాలో టీఆర్‌‌ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. అల్వాల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ నిరసన చేపట్టారు. కేంద్రమే వడ్లన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు ఆధ్వర్యంలో ధర్నాను చేశారు. రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. రైతుల కోసమే తాను ఈ ధర్నాలో పాల్గొన్నానని గద్దర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement