Thursday, May 2, 2024

Breaking: మహబూబాబాద్ జిల్లాలో దంపతుల ఆత్మహ‌త్య‌..

దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అనిల్, దేవి దంపతులు అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, గత నెల రోజుల క్రితం తమ ఇద్దరు కుమార్తెలకు దంపతులు ఇద్దరు కలిసి పురుగుల మందు ఇచ్చి హత్య చేశారు. అనంతరం వారు గ్రామం నుంచి పరారయ్యారు.

తాజాగా, అనిల్, దేవి నిర్మానుష్య ప్రాంతంలో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న అనిల్, దేవీలుగా గుర్తించారు. అభంశుభం తెలియని తమ పిల్లలు లాస్య (2), లోహిత (2 నెలల) పాపకు విషమిచ్చిన తర్వాత భార్యాభర్తలు కనిపించకుండా పోయారు. చివరకూ విగతజీవులుగా మారారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement