Sunday, May 5, 2024

Bengaluru : ఈనెల‌ 17న బెంగళూరు పవన్‌ కల్యాణ్ రోడ్ షో

బెంగ‌ళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్ హాజరు కానున్నారు. విస్తృత ప్రచారం, ఆకట్టుకునే విధానాలతో ఎక్కువ సీట్లు సాధించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండే చిక్కబళ్ళాపుర, కోలారు, బళ్ళారి, రాయచూరు ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించాలని నిర్ణయించారు.

ఏపీకి సరిహద్దున ఉండే జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రచారానికి కార్యాచరణ చేస్తున్నారు. ఈనెల 17న రాయచూరుకు పవన్‌ రానున్నారు. ఉదయం 11 గంటలకు రాయచూరులో బెంజ్‌ సర్కిల్‌ నుంచి రోడ్‌షో ప్రారంభం కానుంది. బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వరనాయక తరపున ప్రచారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement