Thursday, May 2, 2024

ఆ 50 కోట్ల నిధులను ఎస్ ఎన్ డి పి పనులకు కేటాయించండి. కలెక్టర్ కు మేయర్ పారిజాత విన‌తి

బాలాపూర్ జూలై 25 ప్రభ న్యూస్ – సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కు ప్రకటించిన 50 కోట్ల రూపాయలను ఎస్ ఎన్ డి పి నిర్మాణ పనులకు కేటాయించాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.. రంగారెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో కలిసి జిల్లా కలెక్టర్ హరీష్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ లో ఎస్ ఎన్ డి పి పనులు సగం వరకే పూర్తయి అని మిగతా పనులు అలాగే మిగిలిపోయాయని తెలిపారు . ఈ నిధులను ఎస్ ఎన్ డి పి పనులకు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గట్టు బాలక్రిష్ణ, సుబాన్ యాదవ్ ఉన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement