Thursday, May 2, 2024

ఆకస్మికంగా గ్రామాల్లో పర్యటించిన మంచిర్యాల కలెక్టర్

జన్నారం, జులై 25 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నాయక్ ఆకస్మికంగా మంగళవారం పర్యటించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని రికార్డులను పరిశీలించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మండలంలోని కొత్తూరుపల్లె పాఠశాలలో బయోగ్యాస్ ప్లాంటును ఆయన పరిశీలించారు. మండలంలోని రేండ్లగూడలో పల్లె ప్రకృతి వనాన్ని, పాఠశాలను ,స్మశాన వాటికను పరిశీలించి, మొక్కలు నాటారు.

ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ సైరా బాను, డి ఆర్ డి ఓ శేషాద్రి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారావు ఉన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ట్రైని కలెక్టర్లను రేండ్లగూడ సర్పంచి ఆశరాజ్, దేవు నిగూడ సర్పంచ్ గుర్రం శిరీష గోపాల్ రెడ్డి ,కొత్తూరుపల్లి యూత్ నేతలు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రాణి, ఎంపీ ఓ రమేష్, ఆయా పాఠశాలల హెచ్.ఎంలు రాజశేఖర్ ,గ్రామ కార్యదర్శులు సరిత,శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement